తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సామాన్య కుటుంబ యువకుడికి యూఏఈ లో నిర్వహించిన లాటరీలో రూ. 240 కోట్ల భారీ మొత్తం తగలడంతో అతని కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామంలో సంచలనం సృష్టించింది. లాటరీ గెలుచుకున్న యువకుడిని భీమవరం గ్రామానికి చెందిన బొల్లా అనిల్ కుమార్ గా గుర్తించారు. అనిల్ కుమార్ది గ్రామంలో సాధారణ రైతు కుటుంబం.
అతని తండ్రి మాధవరావు, తల్లి భూలక్ష్మి దంపతులు. స్థానిక పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనిల్, హైదరాబాద్లో ఉన్నత విద్యను అభ్యసించి ఆ తర్వాత ఉద్యోగం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్ళారు. ప్రస్తుతం ఆయన అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అనిల్ కుమార్ కొంతకాలంగా యూఏఈలో నిర్వహించే పలు లాటరీల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ఆయన కొనుగోలు చేసిన 10 లాటరీ టికెట్లలో.. తన తల్లి భూలక్ష్మి పుట్టినరోజు తేదీతో ఉన్న నంబర్కు ఏకంగా 240 కోట్ల రూపాయల బహుమతి తగిలింది. తల్లి పుట్టినరోజు తేదీని లక్కీ నంబర్గా ఎంచుకోవడమే ఆయనకు ఇంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.
యూఏఈలో లాటరీ తగలడంతో అనిల్ కుమార్ కుటుంబం రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. ఇంత పెద్ద మొత్తం తగలడంతో అనిల్ తల్లిదండ్రులు మాధవరావు, భూలక్ష్మి దంపతులు అనందంలో మునిగిపోయారు. తన ఉద్యోగాన్ని, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని సరైన మార్గాల్లో వినియోగించుకుంటామని అనిల్ తెలిపినట్లు సమాచారం.
తమ గ్రామానికి చెందిన యువకుడు ప్రపంచ స్థాయి లాటరీలో విజయం సాధించడంపై భీమవరం గ్రామస్తులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబానికి చెందిన అనిల్కు అదృష్టం వరించడం తమందరికీ గర్వకారణమని వారు పేర్కొన్నారు. అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం అనడానికి అనిల్ కుమార్ జీవితమే నిదర్శనంగా మారింది. అయితే అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఈ డబ్బులను ఒక కారు కొనుక్కొని.. సెవెన్ స్టార్స్ హోటల్లో ఒక నెల పాటు బస చేయాలని ప్లాన్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa