తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ రంగం సంస్థలో ఉద్యోగాలు ఆశించే యువతకు ఒక శుభవార్త. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) , ఇతర పట్టణ స్థానిక సంస్థలలో (యూఎల్బీలలో) ఖాళీగా ఉన్న ముఖ్యమైన సాంకేతిక పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 55 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎన్ఏసీ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులు నగర ప్రణాళిక, నిర్మాణ నిర్వహణ వంటి కీలక విభాగాల్లో పనిచేయడానికి ఉద్దేశించినవి. పోస్టుల విరవాల్లోకి వెళ్తే.. సైట్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 40 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. చివరి తేదీ నవంబర్ 8వ తేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా బీ.ఈ / బీ.టెక్ ఏఎంఐఈ (సివిల్ ఇంజినీరింగ్) పూర్తి చేసి ఉండాలి. సివిల్ ఇంజినీరింగ్లో అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక జూనియర్ ప్లానింగ్ పర్సనల్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. మొత్తం పోస్టుల సంఖ్య 15 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు బీ.ఆర్క్ / బీ. ప్లాన్ / ఎంయూఆర్పీ / ఎం (ప్లానింగ్) వంటి అర్బన్ ప్లానింగ్ లేదా ఆర్కిటెక్చర్లో ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో ఎన్ఏసీ వెబ్సైట్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫారమ్, ఎంపిక ప్రక్రియ, జీతం, ఇతర నిబంధనల వివరాల కోసం www.nac.edu.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ.. ఈ పోస్టులు జీహెచ్ఎంసీ, యూఎల్బీల పరిధిలో పనిచేయడం వల్ల నగర పాలన, ప్రభుత్వ పనుల నిర్వహణలో అనుభవాన్ని సంపాదించడానికి మంచి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో నిరుద్యోగిత రేటు ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉంది. అర్హత ఉన్నా.. స్కిల్స్ లేకపోవడంతో చాలామందికి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. అటువంటి వారి కోసం ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa