ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ కళాశాలలో పటేల్ జయంతి కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 03:18 PM

శుక్రవారం సదాశివపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపల్ భారతి మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఏక్తా దివస్ గా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు మురళీకృష్ణ, శకుంతల కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa