కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లో భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పర్యావరణ ప్రేమికులు, సామాజిక వేత్త కోలా రవీందర్ ముదిరాజ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా శుక్రవారం సూరారం చౌరస్తాలో నార్త్ సిటీ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ, అప్పటి నైజాం పాలనలో హైదరాబాదును విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. విద్యార్థులు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa