తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడుతుండగా పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వడదెబ్బతో 9 మంది మృత్యువాత పడ్డారు. ఖమ్మం, KNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ముగ్గురు, ఉమ్మడి అదిలాబాద్ లో ముగ్గురు, వరంగల్ లో ముగ్గురు చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు
![]() |
![]() |