ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన వ్యక్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 22, 2025, 11:29 AM

హైదరాబాద్‌‌లోని మియాపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో మహేశ్ అనే వ్యక్తి భార్య శ్రీదేవి, అత్తపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని మియాపూర్ ఆసుపత్రికి తరలించారు. శ్రీదేవి పరిస్థితి నిలకడగా ఉండగా.. అత్త పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా మహేశ్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తరచుగా మద్యం తాగి వచ్చి భార్యతో గొడవలు పడుతుంటాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com