జిల్లాలో పని చేసిన 61 మంది హోమ్ గార్డులు మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో హోమ్ గార్డులతో సమావేశం నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా హోమ్ గార్డులు చేసిన సేవలను కొనియాడారు. అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని ఇన్చార్జి ఆర్ ఎస్సై మద్దయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa