హైదరాబాద్ లో బుధవారం నిర్వహించిన ముదిరాజ్ కృతజ్ఞత సభలో శ్రీ కాసాని వీరేష్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు సమయం తీసుకుని అయినా వంద శాతం బీసీ కుల గణన చేసి ముదిరాజులకు సంపూర్ణ న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.జాతీయ ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి , అఖిల భారతీయ కోలి సమాజ్ జనరల్ సెక్రటరీ శ్రీ కాసాని వీరేష్ మాట్లాడుతూ ముదిరాజుల కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాహుల్ గాంధీ గారి ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో కుల గణన జరగటం మనందరికీ వచ్చిన మంచి అవకాశం. దాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుకి కూడా ముదిరాజులు అసలు జనాభా కంటే రెండు శాతం తగ్గి తక్కువగా చూపించడం జరిగింది.దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వలేదన్నట్లుగా ముదిరాజుల పరిస్థితి ఉంది. మనకు మంచి చేయాలని పాలకులకు ఉన్న అధికారులు మాత్రం సరిగా కుల గణన చేపట్టకపోవడం బాధాకరం. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో కుల గణన సరిగా చేయలేకపోయారు. ప్రభుత్వం మరో నెల రోజులు సమయం ఇచ్చిన దాన్ని కూడా సద్వినియోగం చేయలేకపోయారు. అందుకని మరో రెండు నెలల సమయం తీసుకుని పూర్తిస్థాయిలో 100% బీసీ కుల గణన సమగ్రంగా జరిపించాలని వేదిక మీద ఉన్న శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో జనాభా దామాషా ప్రకారం ముదిరాజుల అభ్యున్నతి, అభివృద్ధి కోసం ముదిరాజ్ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరుతున్నాం. ఏ ఆశయాలు కోసం అయితే ఈ ముదిరాజ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారో ఆ నిధులు జిల్లాల్లోని అర్హులైన పేద ముదిరాజులకు ఉపయోగపడాలి.
అవి సంఘ నాయకులు ద్వారానే సాధ్యమవుతుంది. చిట్టా చివరిగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ముదిరాజులం కొన్ని లక్షల మంది ఉన్నాము కానీ ఏ ప్రభుత్వాలు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా మనకి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. జనాభాలో అధిక శాతం ఉన్న మన ముదిరాజులకు మాత్రం సీట్ల కేటాయింపు జరగడం లేదు. అందుకనే ఇకనుంచి ఓటర్ల జాబితా నమోదులో మీ పేరు పక్కన తప్పనిసరిగా ముదిరాజు చేర్చుకోవాలి. దాని ద్వారా రాబోయే ఏ ఎన్నికల్లో అయినా మన ప్రాముఖ్యత తెలిసి వస్తుంది. దానిద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా మన ముదిరాజ్ నాయకులకు గుర్తింపునిస్తారు. దానితోపాటు మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మైనార్టీలు కూడా మనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa