ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ గెలుపు కాంగ్రెస్ కు చెంపపెట్టులాంటిది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 06, 2025, 12:26 PM

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి గాలి మాటలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఆయన చేసిన ఆరోపణలకు ఎన్నికల్లో ప్రజలే సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ కు చెంపపెట్టులాంటి జవాబిచ్చారని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాతీర్పును గౌరవించి ఇకనైనా ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాలంటూ రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ఈమేరకు గురువారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa