|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 12:43 PM
వైసీపీపై హోం మంత్రి అనిత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'మావిగన్' పేరు చెబితేనే ప్రజలు నవ్వుకుంటున్నారని, గత ప్రభుత్వం అభివృద్ధి కంటే మాటలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో కనీసం ఫైర్ ఇంజన్ కూడా కొనుగోలు చేయలేదని, ప్రజా భద్రతను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏలూరులో కొత్త మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అనిత పేర్కొన్నారు.
Latest News