|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 04:17 PM
AP: రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త తెలిపింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై విధించిన వడ్డీలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ నెల 31తో ఈ రాయితీ గడువు ముగియనుంది. ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. గత 8 ఏళ్లుగా వడ్డీతో కలిపి రూ.6,072 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయినట్లు ప్రభుత్వం తెలిపింది.
Latest News