|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 12:18 PM
ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక మార్పులపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కేజీల సిలిండర్ల స్థానంలో 10 కేజీల సిలిండర్లను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. గృహ వినియోగదారులకు సిలిండర్ కొరత లేకుండా ఉండేందుకు రీఫిల్లింగ్ పరిమాణాన్ని తగ్గించే వ్యూహాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News