|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 11:55 AM
ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’లో నెలకొన్న ఉద్రిక్తతలు జపాన్ను కలవరపెడుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో సముద్ర మార్గంలో నౌకా దళ మైన్లు జపాన్కు ఆటంకం కలిగిస్తున్నాయి. తమ దేశ మనుగడకు అత్యవసరమైన చమురు సరఫరాను పునరుద్ధరించేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్)ను రంగంలోకి దించే అంశాన్ని జపాన్ పరిశీలిస్తోంది. జపాన్ రాజ్యాంగం ప్రకారం విదేశాల్లో సైనిక బలగాలను మోహరించడంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, దేశ మనుగడకు ముప్పు వాటిల్లితే సైన్యాన్ని పంపే వెసులుబాటు ఉంది.
Latest News