|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 03:37 PM
రేపల్లె నియోజకవర్గానికి వై.ఎస్.ఆర్.సి.పి రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో సమన్వయకర్తగా నియమితులైన పీట నాగమోహన్ కృష్ణ నియోజకవర్గంలోకి వస్తున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కమిషనర్ కూటమి ప్లెక్సీలను వదిలేసి, కేవలం వైస్సార్సీపీ ప్లెక్సీలను మాత్రమే తొలగించడాన్ని నిరసిస్తూ రేపల్లె మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త పిటా నాగమోహన్ కృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News