|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 09:30 PM
Afghanistan : ఒకవైపు Iran–Israel, United States మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, మరోవైపు పొరుగు దేశాలైన Pakistan మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా ఘర్షణలు పెరుగుతున్నాయి. ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూ ఉద్రిక్త పరిస్థితిని సృష్టిస్తున్నాయి.ఇటీవల ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయగా, దానికి ప్రతీకారంగా శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్ దాడులు జరిపింది. పాకిస్తాన్లోని Khyber Pakhtunkhwa ప్రావిన్స్లో ఉన్న సైనిక కేంద్రాలపై వైమానిక దాడులు చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్లోని Taliban ప్రభుత్వం వెల్లడించింది.ఈ దాడుల్లో పాకిస్తాన్కు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపింది. పాకిస్తాన్ ముందుగా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. గురువారం రాత్రి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని స్థావరాలపై దాడులు జరిపినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పాకిస్తాన్ ప్రకటించింది.అయితే ఆ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించింది. దానికి ప్రతిగా పాకిస్తాన్లోని Kohat ప్రాంతంలోని కీలక సైనిక స్థావరాలపై తాము దాడులు నిర్వహించినట్లు తెలిపింది. ముఖ్యంగా Durand Line సమీపంలోని వార్ కమాండ్ సెంటర్లు, ఫోర్ట్ కమాండర్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఈ దాడుల వల్ల కొన్ని నివాస ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయని ఆఫ్ఘనిస్తాన్ అధికారులు తెలిపారు.తీవ్రవాద సమస్యే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తమ దేశంలోకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీవ్రవాదులను పంపించి దాడులు చేయిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.అయితే ఈ ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్ నాయకత్వం ఖండిస్తోంది. పాకిస్తాన్లో జరుగుతున్న దాడులు ఆ దేశ భద్రతా వైఫల్యాల వల్లనే జరుగుతున్నాయని పేర్కొంటోంది. సుమారు 2,600 కిలోమీటర్ల పొడవైన దురండ్ లైన్ సరిహద్దు వెంట ఇరు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బ్రిటీష్ పాలన కాలంలో నిర్ణయించిన ఈ సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ అధికారికంగా అంగీకరించడం లేదు. ఇదే అంశం సహా పలు విషయాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
Latest News