|
|
by Suryaa Desk | Fri, Mar 13, 2026, 12:15 PM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో దేశంలో LPG సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ దందా జోరందుకుంది. అధికారిక ధరలకంటే చాలా ఎక్కువ ధరకు సిలిండర్లు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. కొన్ని నగరాల్లో వాణిజ్య సిలిండర్ ధరలు బ్లాక్లో రూ.3,000 నుంచి రూ.5,000 వరకు చేరినట్టు సమాచారం. ఈ పరిస్థితితో హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాగా, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
Latest News