|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:31 PM
ప్రతి జిల్లాలో ఆయా జిల్లాల కలెక్టర్లు నెలలో కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.నేడు జరిగిన జిల్లాల కలెక్టర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ... సీనియర్ సెక్రటరీలు, నాలుగు రోజులపాటు క్షేత్రస్థాయిలో వెళ్లాలని అన్నారు. దీనిపై పోర్టల్ తయారు చేసి ఆన్లైన్లో పెట్టేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత తీసుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది కలెక్టర్లేనని అన్నారు. ప్రతి విషయంలో నిజానిజాలు తెలుసుకున్న తర్వాత తగిన నిర్ణయాలు తీసుకునే బాధ్యత కలెక్టర్లదే అన్నారు.శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Latest News