|
|
by Suryaa Desk | Wed, Mar 11, 2026, 03:01 PM
AP: వివాహం చేసుకున్న నవ వధువుకు చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలలు గడిచినా భర్త సంసారానికి సుముఖంగా లేకపోవడంతో, అసలు విషయం తెలుసుకున్న ఆమె నిలదీసింది. భర్త నపుంసకుడని, ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని ఆమె ఆరోపించింది. ప్రశ్నించిన ఆమెపై భర్త, అత్తమామలు దాడి చేసి, చంపుతామని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నంద్యాలకు చెందిన పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న యువతికి, కడప జిల్లాకు చెందిన ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న యువకుడితో గత ఏడాది డిసెంబర్ 26న నంద్యాలలో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.
Latest News