|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 03:46 PM
పశ్చిమాసియాలోని యుద్ధ ప్రభావం భారతీయ హోటల్ రంగంపై తీవ్రంగా పడుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, బెంగళూరులలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. ముంబైలో 20% హోటళ్లు మూతపడగా, బెంగళూరు, చెన్నైలలోని రెస్టారెంట్లు గందరగోళంలో ఉన్నాయి. మార్చి 10 నుంచి హోటళ్లు మూసివేసే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ హెచ్చరించింది. చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రవి, ప్రధాని మోదీకి లేఖ రాస్తూ, హోటల్ రంగం అత్యవసర సేవ అని, గ్యాస్ సరఫరా నిలిచిపోతే లక్షలాది మంది ఆకలితో అలమటించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News