|
|
by Suryaa Desk | Tue, Mar 10, 2026, 03:26 PM
ఏపీలో ఎండల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు లేకపోయినా, వచ్చే నాలుగు రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముందని అంచనా వేసింది. ఇప్పటికే ఉదయం నుంచే ఎండ ప్రభావం పెరుగుతుండగా మధ్యాహ్నం వేళ ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Latest News