|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 06:17 PM
రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. ఆంధ్రప్రదేశ్ మీదుగా నడచే రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల టైమింగ్స్ మారాయి. యశ్వంతపూర్-కాచిగూడ-యశ్వంతపూర్, కలబురగి-బెంగళూరు-కలబురగి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలు మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయన్నారు. యశ్వంతపూర్ – కాచిగూడ వందే భారత్ (20704).. హిందూపూర్ రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకుని, 3.57 గంటలకు బయలుదేరుతుంది. అయితే గతంలో ఈ రైలు మధ్యాహ్నం 3.48 గంటలకు వచ్చి.. 3.50 గంటలకు వెళ్లేది. అలాగే కాచిగూడ – యశ్వంతపూర్ వందే భారత్ (20703) రైలు హిందూపూర్ రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం 12.17 గంటలకు వచ్చి.. 12.19 గంటలకు వెళ్లిపోతుంది. గతంలో ఈ రైలు మధ్యాహ్నం 12.08 గంటలకు వచ్చి.. 12.10 గంటలకు వెళ్లిపోయేది.
అలాగే బెంగళూరు - కలబురగి - బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు వేళలు కూడా మారాయి. కలబురగి - బెంగళూరు వందేభారత్ ఎక్స్ప్రె( 22231) రైలు శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్కు ఉదయం 11 గంటలకు బదులు 11.13 గంటలకు చేరుకుంటుంది.. గతంలో ఉదయం 11 గంటలకు వచ్చి 11.02 గంటలకు వెళ్లేది. అలాగే యల్హంక రైల్వే స్టేషన్కు మధ్యాహ్నం 12.28 గంటలకు బదులు 12.30 గంటలకు వస్తుంది. బెంగళూరు-కలబురగి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు (22232) యల్హంక స్టేషన్కు మధ్యాహ్నం 3.05 గంటలకు బదులు 3.09 గంటలకు చేరుకుంటుంది. శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్కు సాయంత్రం 4.23 గంటలకు బదులుగా సాయంత్రం 4.45 గంటలకు వస్తుంది. గతంలో సాయంత్రం 4.23కు వచ్చి 4.25కు వెళ్లేది.
రైలు ప్రయాణికులు ఈ రెండు వందేభారత్ రైళ్ల టైమింగ్స్ మారాయని గమనించాలని అధికారులు సూచించారు. అందుకు తగిన విధంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలన్నారు. ఈ రెండు వందేభారత్ రైళ్లు వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటాయి. యశ్వంతపూర్-కాచిగూడ-యశ్వంతపూర్ వందేభాతర్ ఎక్స్ప్రెస్ రైలు మహబూబ్నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
Latest News