|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 03:27 PM
వేసవిలో ఫాల్సా పండ్లు తినడం వల్ల శరీరానికి చల్లదనం, శక్తి లభిస్తాయని ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు ఇందులో విటమిన్ C, A, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, నీటి లోపాన్ని సరిచేసి, దాహాన్ని తగ్గిస్తాయి. ఫాల్సా జ్యూస్, శర్బత్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆకలిని పెంచుతాయి. హృదయ ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు, చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి.
Latest News