2 రోజులుగా పతనం.. మళ్లీ తగ్గిన బంగారం ధర
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 10:25 PM

పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. అమెరికా- ఇరాన్ యుద్ధం వేళ బంగారం ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలను తలకిందులు చేస్తూ దేశీయ మార్కెట్ల పసిడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గాయి. గల్ఫ్ దేశాలపైన ఇరాన్ మిసైల్స్ దాడి చేస్తోంది. అమెరికా భీకర దాడులు ఉంటాయని ప్రకటించింది. దీంతో సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు. గత రెండు రోజుల వరకు ఇదే జరిగినా ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆల్ టైమ్ హై స్థాయి నుంచి బంగారం ధరలు పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5400 డాలర్ల గరిష్టాన్ని తాకి ఆ తర్వాత వెనక్కి తగ్గుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఈ రెండు రోజుల్లోనే తులంపై ఏకంగా రూ.3000 వరకు తగ్గాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు తనిష్క్, మలబార్ వంటి ప్రముఖ సంస్థల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


దేశీయ మార్కెట్లో 22 క్యారెట్లబంగారం రేటు క్రితం రోజు తులంపై రూ.2350 మేర తగ్గిన సంగతి తెలిసిందే. అదే ట్రెండ్ కొనసాగిస్తూ ఈరోజు మరో రూ.450 మేర తగ్గింది. దీంతో రెండు రోజుల్లోనే తులం రేటు రూ.2800 వరకు తగ్గింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.3170 మేర తగ్గింది. ప్రముఖ జువెలరీల్లో బంగారం రేట్లు ఎంతు ఉన్నాయంటే.


 తనిష్క్ జువెలరీలో రేట్లు


తనిష్క్ జువెలరీల్లో మార్చి 3వ తేదీన 22 క్యారెట్ల బంగారం రేటు 1 గ్రాముపై ఏకంగా రూ.265 మేర పడిపోయింది. దీంతో గ్రాము ధర రూ.15,405 వద్దకు దిగివచ్చింది. ఇక 10 గ్రాములు (తులం) రేటు చూసుకుంటే రూ.1,54,050 వద్దకు దిగివచ్చింది.


మలబార్ గోల్డ్ జువెలరీల్లో


మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీల్లో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 1 గ్రాముపై రూ.220 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.15,365 వద్దకు దిగివచ్చింది. అలాగే పది గ్రాముల ధర చూసుకుంటే రూ.2200 మేర తగ్గి రూ.1,53,650 వద్దకు తగ్గింది.


జొయాలుక్కాస్ జువెలరీల్లో


జొయాలక్కాస్ జువెలరీల్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.220 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.15,365 వద్దకు తగ్గింది. పది గ్రాముల లెక్క చూసుకుంటే రూ.1,53,650 వద్దకు దిగొచ్చింది.


కల్యాణ్ జువెలరీల్లో


కల్యాణ్ జువెలరీల్లో ఈరోజు ఆభరణాల బంగారం రేటు 1 గ్రాముకు రూ.45 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ.15,585 వద్ద ట్రేడవుతోంది. దీంతో తులం బంగారం రేటు రూ.1,55,850 వద్ద ట్రేడవుతోంది.


లలితా జువెలరీల్లో


లలితా జువెలరీల్లో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు గ్రాముకు రూ. 120 మేర తగ్గింది. దీంతో గ్రాము రేటు రుూ.15,465 వద్దకు తగ్గింది. ఇక తులం రేటు చూసుకుంటే ఈరోజు రూ.1,54,650 వద్ద ట్రేడవుతోంది.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM