|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 12:04 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (04.03.2026) విశాఖపట్నం,అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీకి చేరుకుంటారు. తంగుల్గూడా గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో నిర్వహించనున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుని రాణాప్రతాప్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు.
Latest News