|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:09 PM
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలోనే ఆయన మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామంతో ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్, ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనుతూ క్వామ్ నగరంలోని పవిత్ర జామ్కరాన్ మసీదుపై 'ఎర్ర జెండా'ను ఎగురవేసింది.ఖమేనీ ఆకస్మిక మరణంతో దేశంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా ఇరాన్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునేంత వరకు పాలనను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన అత్యున్నత మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలిలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చీఫ్ జస్టిస్ ఎజీ, క్లారిక్ సభ్యుడు అలీరెజా అరాఫీ ఉన్నారు. షియా సంప్రదాయం ప్రకారం ఎర్ర జెండాను ఎగురవేయడం అంటే అన్యాయంగా చిందిన రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేయడమే.
Latest News