|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 11:47 PM
టీ20 ప్రపంచకప్ 2026లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత్పై వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓ దశలో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన వెస్టిండీస్.. చివర్లో పోవెల్, జేస్ హోల్డర్ బ్యాట్ ఝుళిపించడంతో ఊహించిన దానికంటే ఎక్కువ రన్సే స్కోరు చేసింది. దీంతో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. వెస్టిండీస్కు బ్యాటింగ్ అప్పగించాడు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. షై హోప్ (32), రోస్టన్ ఛేజ్ (36) తొలి వికెట్కు 68 పరుగులు జోడించారు. ఈ దశలో వరుణ్ చక్రవర్తి.. భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇన్ ఫామ్ బ్యాటర్ షిమ్రాన్ హిట్మెయర్ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 12 బంతుల్లో 27 రన్స్ చేసిన తర్వాత అతడిని జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు.
బుమ్రా ఒకే ఓవర్లో హిట్మెయర్, రోస్టన్ ఛేజ్ను ఔట్ చేసి.. భారత్ను పోటీలోకి తెచ్చాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా వికెట్ తీయడంతో 15 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్.. 125/5తో నిలిచింది. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ ఆ తర్వాత వెస్టిండీస్ బ్యాటర్లు గేర్ మార్చారు. అర్షదీప్ వేసిన తర్వాతి ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టారు. వరుణ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.
ఇక చివరకు వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోవ్మన్ పావెల్ (34), జేసన్ హోల్డర్ (37) కలిసి ఐదో వికెట్కు 35 బంతుల్లో 76 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీగా. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు.
Latest News