సీబీఐ చార్జిషీట్‌ను చంద్రబాబు తప్పుబట్టడం సరికాదు: జగన్
 

by Suryaa Desk | Fri, Feb 06, 2026, 07:50 PM

 సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను చంద్రబాబు తప్పుబట్టడం సరికాదని జగన్ అన్నారు. చంద్రబాబు భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వ సంస్థ సీబీఐ ఇచ్చిన నివేదిక తనకు అనుకూలంగా రాలేదంటే, చంద్రబాబు వాదన ఎలా సరైనదవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను సమర్థించుకోవడానికే కమిషన్ వేసుకుంటున్నారని జగన్ ఆరోపించారు.తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేది చంద్రబాబు ఆడుతున్న పచ్చి అబద్ధమని, దీనిని సీబీఐ రిపోర్ట్ సైతం తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్‌ఐ వంటి కేంద్ర సంస్థలు ఎటువంటి కల్తీ జరగలేదని స్పష్టం చేశాయని గుర్తు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే శ్రీవెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచేలా చంద్రబాబు దుష్ప్రచారం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

Latest News
Qualcomm, Tata Electronics to produce automotive modules in India Fri, Feb 20, 2026, 03:24 PM
'I won’t bat 15 overs to correct poor form and ignore the game': Jos Buttler Fri, Feb 20, 2026, 03:04 PM
Delhi Police say taking legal action after Youth Cong members breach security at AI summit Fri, Feb 20, 2026, 02:59 PM
Historic milestone for bilateral ties: Slovakia President after meeting PM Modi Fri, Feb 20, 2026, 02:48 PM
After past mistakes, Congress found Tamil Nadu toehold though allies but trouble brews ahead of polls Fri, Feb 20, 2026, 02:44 PM