|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:24 PM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాయర్ అవతారం ఎత్తబోతున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఆమె న్యాయవాదిగా వాదనలు వినిపించబోతున్నారు. వివరాల్లోకి వెళితే... కేంద్ర ఎన్నికల సంఘం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగబోతోంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ రాబోతోంది. ఈ క్రమంలో తన కేసును ఆమే వాదించబోతున్నారు. మమత విషయానికి వస్తే... ఆమె కోల్ కతాలోని జోగేశ్ చంద్ర చౌదరి కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. తన పిటిషన్ కు సంబంధించి... సుప్రీంకోర్టులో పార్టీ ఇన్ పర్సన్ గా వాదించేందుకు ఆమె అనుమతి కోరారు. ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో సొంతంగా వాదనలు వినిపించబోతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Latest News