వార్మప్‌లోనే సెంచరీ.. వరల్డ్‌కప్‌లో ఛాన్స్ ఇస్తే డబుల్ సెంచరీ పక్కా?
 

by Suryaa Desk | Mon, Feb 02, 2026, 08:52 PM

టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభానికి ముందే భారత యువ క్రికెటర్లు మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించారు. అమెరికాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇండియా-ఎ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు.ఈ మ్యాచ్‌లో వికెట్‌కీపర్ బ్యాటర్ నారాయణ్ జగదీశన్ ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ ఆయుష్ బదోని, తిలక్ వర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరును నమోదు చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జగదీశన్ బ్యాటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఓపెనర్‌గా బరిలోకి దిగిన జగదీశన్, అమెరికా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన అతడు తన అద్భుత ఫామ్‌ను మరోసారి నిరూపించాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు బాదిన జగదీశన్, 54 బంతుల్లో 104 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ మెయిన్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకోలేకపోయినా, భవిష్యత్తులో తన స్థానం సుస్థిరమని సెలెక్టర్లకు గట్టి సందేశం పంపించాడు.సర్జరీ కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన తెలుగు తేజం తిలక్ వర్మ, ఈ మ్యాచ్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఫిట్‌నెస్ నిరూపించుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్‌కు దిగిన తిలక్, ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ధాటిగా ఆడాడు. కేవలం 24 బంతుల్లో 38 పరుగులు చేసిన అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అతని బ్యాటింగ్ చూస్తే పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో ఉన్నాడన్న విషయం స్పష్టమైంది. దీంతో ప్రపంచకప్ మెయిన్ టోర్నీలో అతడి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దాదాపు ఖాయమైంది.జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కేవలం 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదిన బదోని, అమెరికా బౌలర్లపై ఎలాంటి కనికరం చూపకుండా విరుచుకుపడ్డాడు. 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 26 బంతుల్లోనే 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కూడా 13 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు.వీరి విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఇండియా-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 238 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. టీమిండియా బ్యాటర్ల దాడిని తట్టుకోలేక అమెరికా మొత్తం 10 మంది బౌలర్లను ఉపయోగించాల్సి వచ్చింది. టీమిండియా మూలాలన్న సౌరభ్ నేత్రవల్కర్ మాత్రం 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఫర్వాలేదనిపించగా, శుభమ్ రంజనే 2 ఓవర్లలో 12 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. మిగిలిన బౌలర్లందరూ జగదీశన్, బదోని బ్యాటింగ్ దెబ్బకు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.ఈ భారీ స్కోరు చూస్తుంటే, టీ20 ప్రపంచకప్ కోసం భారత యువ ఆటగాళ్లు ఏ స్థాయిలో సిద్ధమయ్యారో స్పష్టంగా అర్థమవుతోంది.

Latest News
10 semiconductor projects approved, 4 reach pilot production: Minister Wed, Feb 04, 2026, 04:40 PM
BJP-JD(S) harassing Dalit Minister, alleges Karnataka Deputy CM Shivakumar amid overnight protest Wed, Feb 04, 2026, 04:35 PM
Bihar RJD chief Mangani Lal Mandal hospitalised in Delhi for liver treatment Wed, Feb 04, 2026, 04:34 PM
Japanese researchers to begin human trial for Nipah vaccine in April Wed, Feb 04, 2026, 04:32 PM
PM Modi to visit Malaysia this week as both countries look at bolstering strategic ties Wed, Feb 04, 2026, 04:31 PM