3 నెలల్లోనే రెండోసారి భారీగా లేఆఫ్స్,,,ఒకేసారి 16000 మందిని పీకేసిన టెక్ కంపెనీ
 

by Suryaa Desk | Wed, Jan 28, 2026, 10:51 PM

ప్రపంచ స్థాయి దిగ్గజ టెక్ కంపెనీ, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఊహించని విధంగా షాకిచ్చింది. మరోసారి భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది. తాజాగా 16 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెటీ వెల్లడించారు. మూడు నెలల వ్యవధిలో ఈ స్థాయిలో రెండోసారి వేల సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించడం గమనార్హం. గత ఏడాది 2025, అక్టోబర్ 14వ తేదీనే 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా లేఆఫ్స్‌లోకి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణ ప్లాన్స్ నేపథ్యంలో ఒకేసారి 16 వేల మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే మూడు నెలల్లో ఈ లేఆఫ్స్ ప్రక్రియను పూర్తి చేస్తామని జనవరి 28, 2026 బుధవారం రోజున అధికారికంగా ప్రకటన చేసింది. 'అమెజాన్ సంస్థల్లోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16000 మంది ఉద్యోగులు ఈ రెండో విడత లేఆఫ్స్‌లో ప్రభావితం కానున్నారు. ఈ ఉద్యోగాల కోతలో ప్రభావితమవుతున్న వారికి మద్దతుగా నిలిచేందుకు మేము కృషి చేస్తాము' అని అమెజాన్ తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.


 కంపెనీలో మొత్తం 30 వేల మందిని తొలగించాలనే ప్రణాళికలో భాగంగా రెండో విడతలో 16 వేల మందికి పింక్ స్లిప్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్‌లో ప్రధానంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రీసోర్సెస్ డిపార్ట్‌మెంట్ వంటి విభాగాల్లోని ఉద్యోగులపై అధిక ప్రభావం ఉంటుందని మీడియా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. గతేడాది అక్టోబర్‌లో అమెజాన్ 14 వేల వైట్ కాలర్ జాబ్స్ తొలగించింది. ఆపరేషనల్ లెవెల్ రోల్స్ తగ్గించడం ద్వారా కంపెనీపై అధిక భారాన్ని తగ్గించుకోవాలని టెక్ దిగ్గజం భావిస్తున్నట్లు ఆ సమయంలో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ప్రకటించారు.


అమెజాన్ మరోసారి వేలాది మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన చేయడంతో టెక్ రంగంలోని ఉద్యోగుల్లో లేఆఫ్స్ గుబులు మొదలైందని చెప్పవచ్చు. దేశీయంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం మరింత మందిని తొలగించే ప్లాన్ ఉన్నట్లు తెలిపింది. అలాగే ఇతర కంపెనీలు మరోసారి లేఆఫ్స్ బాటపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని అనుకున్నప్పటికీ ప్రస్తుతం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్ అల్లర్లు, దేశాల మధ్య యుద్ధాలు, సుంకాల వంటివి కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి.

Latest News
South Korea, US discuss joint fact sheet, visa cooperation Thu, Jan 29, 2026, 02:47 PM
DPIIT proposes amendments to align India's Designs Act with global best practices Thu, Jan 29, 2026, 02:44 PM
Maharashtra mourns: Deputy CM Ajit Pawar cremated with full State honours Thu, Jan 29, 2026, 02:43 PM
India climbs to 38th rank in global innovation index 2025, shows strong progress: Economic Survey Thu, Jan 29, 2026, 02:01 PM
If seers ignore assault on other sadhus, they are 'dhongi', says Swami Avimukteshwaranand Thu, Jan 29, 2026, 01:59 PM