|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:41 PM
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన, అత్యున్నత గౌరవం దక్కింది. ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం ‘ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ను ప్రధాని మోదీకి ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ మంగళవారం ప్రదానం చేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి ప్రపంచ ప్రభుత్వాధినేతగా మోదీ చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా అడిస్ అబాబాలోని అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో.. మోదీకి ఈ అవార్డును అందించారు.
భారత్-ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో ఆయన దూరదృష్టి గల నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పురస్కారం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. "ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ పురస్కారం దక్కడం నాకు గౌరవంగా ఉందని చెప్పారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నానుని పోస్టులో రాసుకొచ్చారు.
కున్నారంటే
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన దేశాలలో ఒకటైన ఇథియోపియా నుంచి ఈ పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎంతో వినయంతో, కృతజ్ఞతతో దీనిని స్వీకరిస్తున్నానని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో పాటు ఇథియోపియా పురోగతికి శతాబ్దాలుగా కృషి చేస్తున్న భారతీయ ఉపాధ్యాయుల పాత్రను కూడా ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ జాతీయ సమైక్యత, స్థిరత్వం, సమ్మిళిత అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను మోదీ ప్రశంసించారు.
ఈ అవార్డు ప్రదానం.. భారత్, ఇథియోపియా మధ్య బలమైన భాగస్వామ్యానికి, అలాగే గ్లోబల్ సౌత్ సానుకూల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఒక మైలురాయిగా నిలిచిందని విదేశాంగ శాఖ తెలిపింది. మోదీ ఇక్కడకు రాకముందు జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ రెట్టింపై 500 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. భారత ఆర్తిక పురోగతిలో పాలుపంచుకుని.. లబ్ధి పొందలని జోర్డాన్ వాణిజ్య సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు.
Latest News