|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 10:32 AM
AP: రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్ తనకు తొలి ప్రాధాన్యమని, ఆ సంస్థ ద్వారా గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె పేర్కొన్నారు. బిజినెస్ టుడే సంస్థ ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన ఎంపీడబ్ల్యూ 2025 కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారని నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు.. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి సమాధానమిచ్చారు.
Latest News