|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:23 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం నగర అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. నగరంలో త్వరలోనే ఆధునిక సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘సివిక్ అప్పోజిషన్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థ ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టుకు బదులిస్తూ సీఎం ఈ హామీ ఇచ్చారు.విశాఖ నగరంలో పాదచారులకు అనువుగా ఉన్న ఫుట్పాత్లు, ఆహ్లాదాన్ని పంచే పచ్చదనాన్ని ఆ సంస్థ ప్రశంసించింది. ఈ విషయంలో బెంగళూరు కంటే విశాఖ ఎంతో మెరుగ్గా ఉందని పేర్కొంది. సరైన వసతులు కల్పిస్తే దేశంలో తదుపరి ఐటీ హబ్గా ఎదిగే సత్తా విశాఖకు ఉందని అభిప్రాయపడింది. ఇదే స్ఫూర్తితో నగరంలో సైక్లింగ్ లేన్లను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్లను ట్యాగ్ చేస్తూ కోరింది.ఈ ట్వీట్పై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. "విశాఖలో నడకకు అనువైన ఫుట్పాత్లు, పెరిగిన పచ్చదనం నగరవాసులకు, పర్యాటకులకు మంచి అనుభూతిని పంచుతున్నందుకు సంతోషంగా ఉంది. నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నాం. ఈ దిశగా త్వరలోనే సైక్లింగ్ ట్రాక్లను కూడా ప్రారంభిస్తాం" అని ఆయన తన సమాధానంలో పేర్కొన్నారు.
Latest News