|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:30 PM
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. పెనుకొండకు చెందిన గంగాధర్ (46) కార్లను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు గత కొంతకాలంగా గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో ఖర్జూర పండ్లు తింటుండగా, ప్రమాదవశాత్తు ఓ గింజ గొంతులో ఇరుక్కుంది. అది శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో గంగాధర్కు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది.కుటుంబసభ్యులు వెంటనే అతడిని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా అనంతపురంలోని పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో కుటుంబసభ్యులు అతడిని అనంతపురానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గంగాధర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Latest News