|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:09 PM
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ఇటీవల వారణాసిలో పర్యటించారు. తల్లి అంజలితో కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఆమె, కాశీ వీధుల్లో కలియతిరుగుతూ షాపింగ్ చేశారు. స్థానిక వంటకాలను ఆస్వాదించారు. తన 36 గంటల యాత్రకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా, అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.తన కాశీ యాత్ర ఎన్నో మధురానుభూతులను పంచిందని సారా తెలిపారు. అక్కడి వీధుల్లో తిరుగుతూ ప్రసిద్ధి చెందిన బనారసీ చీరను కొనుగోలు చేసినట్లు చెప్పారు. అలాగే, తిరంగా బర్ఫీ, దహీ వడ వంటి స్థానిక వంటకాలతో పాటు మట్టి కప్పులో టీ తాగడం వంటివి మర్చిపోలేని అనుభవాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా బోటింగ్ కూడా చేసినట్లు ఆమె తన పోస్టులో వివరించారు.
Latest News