|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 08:41 PM
గతేడాది జూన్, ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి చివరకు ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా పదవి నుంచి తప్పుకుని, భారత్కు పారిపోయిన వచ్చారు. అప్పటి నుంచి భారత్, బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు క్రమేపీ బలహీనపడుతున్నాయి. ఈ క్రమంలో భారత్పై ఆ దేశ నేతలు తమ అక్కసు వెళ్లగక్కుతూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా, బంగ్లాదేశ్ మాజీ జనరల్ అబ్దుల్లాహిల్ అమాన్ ఆజ్మీ భారత్పై నోరుపారేసుకున్నారు. బంగ్లా శాంతికి భారత్తో ముడిపెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ ముక్కలు అవ్వనంత వరకు మా దేశంలో పూర్తిస్థాయి శాంతి నెలకోదని కారుకూతలు కూశారు.
విశిష్టతలివే!
బంగ్లా ఆర్మీ మాజీ జనరల్ అమాన్ ఆజ్మీ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నాయకులు గతాన్ని మరిచిపోయి.. భారత్పై అక్కసు వెళ్లగక్కడంపై మండిపడుతున్నారు. బంగ్లా స్వాతంత్య్రం కోసం చేసిన సహాయాన్ని మరిచి.. భారత్పై విషం చిమ్మం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మొహమ్మద్ యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వంతో సంబంధాల పునరుద్దరణకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ బంగ్లాదేశ్ మాజీ సైన్యాధిపతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో హిందువులు, పాక్ను వ్యతిరేకులపై నరమేధానికి పాల్పడిన యుద్ధ నేరాల్లో దోషిగా నిర్దారణ అయిన జమాతే ఇస్లామీ మాజీ అధినేత గులామ్ అజామ్ కుమారుడే ఈ అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ . అతడి కుటుంబ నేపథ్యం, వేర్పాటువాద రాజకీయాలతో దీర్ఘకాల అనుబంధం కారణంగా బంగ్లాదేశ్ ప్రజా వేదికలో ఆయనను వివాదాస్పద వ్యక్తిగా మార్చాయి. ఆన్లైన్ వేదికగా భారత్ను విమర్శిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే రీతిలో ప్రాంతీయ పరిణామాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు.
భారత్, బంగ్లాదేశ్ సంబంధాలను పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆ దేశంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని బంగ్లాదేశ్ను పాకిస్థాన్, చైనాల వైపు మరింతగా మళ్లించేందుకు భారత్ వ్యతిరేక కథనాలను ప్రోత్సహించే వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.
యువత ఉద్యమం కారణంగా షేక్ హసీనా పదవి నుంచి తప్పుకుని దేశం విడిచి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఏర్పాటయ్యింది. బంగ్లాదేశ్లోని హిందూ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని జరుగుతోన్న దాడులపై ఎప్పటికప్పుడు భారత్ ఆందోళనను వ్యక్తంచేస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ, సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నామని ఇరుదేశాలు చెబుతూ వస్తున్నాయి.
Latest News