|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:13 PM
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. రాజస్థాన్లోని ప్రఖ్యాత జైపూర్ వాక్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్గా హర్మన్ప్రీత్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటికే ఆమె విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి.ఈ విషయాన్ని మ్యూజియం వ్యవస్థాపకులు, క్యూరేటర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇటీవల తమ బృందం హర్మన్ప్రీత్ను కలిసి, విగ్రహం తయారీకి అవసరమైన కొలతలు, ఫొటోలు, వీడియోలు తీసుకుందని తెలిపారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు సాగిందని ఆయన వివరించారు."తన మైనపు విగ్రహం ఏర్పాటు పట్ల హర్మన్ప్రీత్ చాలా ఉత్సాహం చూపించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తన కుటుంబంతో కలిసి వస్తానని చెప్పారు. మ్యూజియం యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు" అని శ్రీవాస్తవ పేర్కొన్నారు. సమావేశం సందర్భంగా హర్మన్ప్రీత్ మ్యూజియంలోని 'శీశ్ మహల్' గురించి ప్రశంసించారని, మైనపు విగ్రహాల తయారీ గురించి ఆసక్తిగా తెలుసుకున్నారని ఆయన అన్నారు.
Latest News