నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం
 

by Suryaa Desk | Tue, Dec 02, 2025, 07:52 PM

నెల్లూరు నగర మేయర్‌ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్‌ 18న అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేషన్‌లోని మెజారిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.నెల్లూరు కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. అయితే, ఇటీవల రాజకీయ సమీకరణాలు మారడంతో వీరిలో 40 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీకి 42 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. ఈ సంఖ్యా బలంతో, కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు.ఈ నోటీసులను పరిశీలించిన కలెక్టర్, అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 18న జరిగే ప్రత్యేక సమావేశంలో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఓటింగ్‌తో ప్రస్తుత మేయర్ స్రవంతి భవితవ్యం తేలిపోనుంది. అనంతరం కొత్త మేయర్ ఎన్నికకు మార్గం సుగమం కానుంది.

Latest News
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM
S&P upgrades India's insolvency regime on stronger creditor protection Thu, Dec 04, 2025, 04:54 PM