రెండు చెంచాల పాలతో.... పగిలిన మడమలు మృదువుగా మారతాయి
 

by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:32 PM

చలికాలంలో ఎన్నో చర్మ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యం పగిలిన మడమలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్య పాదాల అందాన్ని నాశనం చేస్తాయి. దీంతో, మగిలిన మడమలతో నలుగురిలో తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వీటిని లైట్ తీసుకుంటే తరచుగా నొప్పి, ఇన్ఫెక్షన్‌కు కూడా కారణమవుతాయి.


​పగిలిన మడమల కారణంగా చికాకు వస్తుంది. మంట పుడుతోంది. అయితే, ఈ సమస్యను వదిలించుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కొందరు మాయిశ్చరైజర్లు, వాసెలిన్ రాసుకుంటారు. అయితే, వీటి వల్ల రిలీఫ్ లభించదు. ఇలాంటి వారి కోసం ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ ఉపాసన వోహ్రా అద్భుతమైన చిట్కాను పంచుకున్నారు. తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ చిట్కాను షేర్ చేశారు. ఆ పూర్తి వివరాలపై ఇప్పుడు చుద్దాం.


  డాక్టర్ ఉపాసన చిట్కా


శీతాకాలంలో పగిలిన మడమల సమస్య తీవ్రంగా ఉంటుంది. మడమలు మాత్రమే కాకుండా కాళ్లు, చేతులు కూడా పగులుతుంటాయని డాక్టర్ ఉపాసన అంటున్నారు. ఇందుకోసం చర్మాన్ని బయట నుంచి మాత్రమే కాకుండా లోపలి నుంచి తేమగా ఉంచాలని చెప్పారు.


ఇందుకోసం ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ గోరువెచ్చని నీటిలో ఓ రెండు చెంచాల గోరువెచ్చని పాలు కలపండి. లేదంటే.. ఒక టీస్పూన్ గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ (సుమారు 3 మి.లీ) ఆముదం కలపండి. ఈ రెండింటి మిశ్రమాల్లో ఏదైనా ఒకదాన్ని 30 రోజుల పాటు తాగండి. ఈ చిట్కా వల్ల గట్టి చర్మం కూడా లోపల నుంచి మృదువుగా మారుతుందని డాక్టర్ చెప్పారు.


చర్మాన్ని తేమగా ఉంచుకోండి


లోపల నుంచి తేమ అందించడానికి పాల చిట్కా బాగా పనికొస్తుంది. ఇక, బాహ్యంగా చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. ఇందుకోసం స్నానం చేసిన వెంటనే చేతులు, చీలమండలు, పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మీరు కావాలనుకుంటే కొబ్బరి నూనె, వాసెలిన్, ఆలివ్ నూనె ఉపయోగించవచ్చు.


ప్రత్యామ్నాయంగా నిమ్మకాయ, గ్లిజరిన్‌ని కలిపి ఓ ప్యాక్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని పాదాల మడమలకు, చేతులకు అప్లై చేయవచ్చు. ఈ ప్యాక్‌ని అప్లై చేసిన తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచండి. కావాలంటే తేనెను కూడా అప్లై చేసుకోవచ్చు.


డాక్టర్ ఉపాసన ఏం చెప్పారో వీడియో చూడండి


రాత్రిపూట ఇవి ట్రై చేయండి


డాక్టర్ ఉపాసన ప్రకారం మడమల పగుళ్లు తీవ్రంగా ఉంటే రాత్రిపూట కొన్ని చిట్కాలు ట్రై చేయవచ్చు. ఇందుకోసం మీ పాదాల్ని గోరువెచ్చని నీటిలో 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టండి. ఈ నీటికి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేయండి. ఆ తర్వాత మీ పాదాల్ని తేలికగా స్క్రబ్ చేసి.. మాయిశ్చరైజర్ రాయమండి. తేమను లాక్ చేయడానికి నిద్రపోయే ముందు సాక్స్ ధరించండి. ఈ చిట్కాను ట్రై చేయడం వల్ల మడమలు చాలా మృదువుగా మారతాయి.


అరటిపండు, తేనె ప్యాక్


పండిన అరటిపండు, తేనెను ఉపయోగించి పగిలిన మడమలకు చెక్ పెట్టవచ్చు. పండిన అరటిపండ్లు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. తేనె దానిని హైడ్రేట్ చేస్తుంది.


ఇందుకోసం పండిన అరటిపండును మెత్తగా చేసి, ఒక టీస్పూన్ తేనె కలపండి. దానిని మడమలకు అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. పగుళ్లను నయం చేస్తుంది. కొన్ని రోజుల్లోనే మార్పు చూస్తారు.


పాలు, తేనె మిశ్రమంలో నానబెట్టండి


పాలు, తేనె రెండూ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచే మాయిశ్చరైజర్లు. వీటిని వాడటం వల్ల మడమల పగుళ్లు తగ్గి.. అవి మృదువుగా మారతాయి. ఇందుకోసం ఒక టబ్‌లోకి గోరువెచ్చని నీరు తీసుకోండి. ఈ నీటిలో ఒక కప్పు పాలు, రెండు టీస్పూన్ల తేనె కలపండి.


మీ పాదాల్ని ఆ నీటిలో 15 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత సున్నితంగా స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. పొడిబారకుండా ఉంటుంది. మడమల పగుళ్లు నయమవుతాయి.

Latest News
India's exports rebound stronger in November Thu, Dec 04, 2025, 05:08 PM
Rise and fall of first time Congress Kerala MLA Rahul Mamkootathil Thu, Dec 04, 2025, 05:07 PM
Chhattisgarh: 'Maths Park' ignites passion for subject among children Thu, Dec 04, 2025, 05:05 PM
Jaipur Open 2025: Yuvraj Sandhu fires 66 to establish three-shot lead after round three Thu, Dec 04, 2025, 04:56 PM
S&P upgrades India's insolvency regime on stronger creditor protection Thu, Dec 04, 2025, 04:54 PM