|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:13 PM
రాంచీ వన్డేలో 17 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా మూడు వన్డేలో సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో సత్తాచాటాడు. వింటేజ్ విరాట్ను గుర్తుకు తెచ్చే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ తర్వాత కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో విరాట్ కోహ్లీ .. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను పట్టించుకోకుండా వెళ్తున్నట్లు ఉంది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్కు మెట్లు ఎక్కుతు వెళ్తున్నాడు. అక్కడ తలుపు వద్ద హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. అయితే సరిగ్గా గంభీర్ సమీపంలోకి వెళ్లేముందు కోహ్లీ జేబులో నుంచి తన ఫోన్ తీశాడు. ఫోన్ చూస్తూ.. గంభీర్ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీ కావాలనే గంభీర్ను పట్టించుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లలో కొందరు.. కోహ్లీ చేసింది కరెక్ట్ అని పేర్కొంటున్నారు. గంభీర్కు అలానే జరగాలి అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో వ్యూస్ కోసమే ఇలాంటి వీడియోలు పనికొస్తాయని అందులో ఎలాంటి నిజం లేదని పేర్కొంటున్నారు. కోహ్లీ సెంచరీ చేసి ఔట్ అయ్యాక గంభీర్.. అతడిని ప్రశంసించాడు. కోహ్లీ కూడా గంభీర్ను హగ్ చేసుకున్నాడని ఫొటోలు షేర్ చేస్తున్నారు.
ఇక విరాట్ కోహ్లీ.. రాంచీ వన్డేలో 102 బంతుల్లో సెంచరీ కొట్టాడు. దీంతో తన కెరీర్లో 83వ సెంచరీని నమోదు చేశాడు. వన్డేల్లో 52వది. ఫలితంగా ఓ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గానూ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం కోహ్లీ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కోహ్లీ. మొత్తంగా 120 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి.