|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:32 PM
ఆర్టీసీ బస్సులో సీటు కోసం జరిగిన ఓ చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ మహిళ సహ ప్రయాణికుడిపై దాడి చేసి, జుట్టు పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన తుని నుంచి నర్సీపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే, కొంతమంది మహిళలు ఓ సీటులో కర్చీఫ్ వేసి ఉంచారు. అది గమనించని ఓ ప్రయాణికుడు ఆ సీటులో కూర్చున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ మహిళ, "మేము కర్చీఫ్ వేసిన సీట్లో ఎలా కూర్చుంటావు?" అంటూ అతడితో వాగ్వాదానికి దిగింది. మాటామాటా పెరగడంతో ఆమె సహనం కోల్పోయి, సదరు ప్రయాణికుడి జుట్టు పట్టుకుని దాడి చేసింది. ఈ అనూహ్య పరిణామంతో అతడు నివ్వెరపోయాడు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే ఈ గొడవ జరిగింది.ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో మహిళల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో సీట్ల కోసం తరచూ ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
Latest News