|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:55 PM
రష్యాకు చెందిన 'విరాట్' అనే ఆయిల్ ట్యాంకర్పై శనివారం మానవ రహిత సముద్ర వాహనం (అన్మ్యాన్డ్ సీ వెహికల్) దాడి చేసింది. శుక్రవారం రాత్రి కూడా ఇదే ట్యాంకర్పై దాడి జరగ్గా, ఇది రెండో ఘటన. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్బీయూ), నౌకాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఏఎఫ్పీ కథనం వెల్లడించింది. తమపై డ్రోన్ దాడి జరిగిందని, సహాయం కావాలని ట్యాంకర్ సిబ్బంది రేడియో ద్వారా అత్యవసర సందేశం పంపారు. ఆధునిక 'సీ బేబీ' నావల్ డ్రోన్లతో ఈ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నామని, దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా ఉక్రెయిన్ వర్గాలు విడుదల చేశాయి.గాంబియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ ట్యాంకర్లు, రష్యా 'షాడో ఫ్లీట్'లో భాగంగా పనిచేస్తున్నాయని తెలుస్తోంది. పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ఈ ట్యాంకర్లు రష్యా నుంచి చమురును రవాణా చేస్తున్నాయి. ఈ షాడో ఫ్లీట్ ద్వారా వచ్చే ఆదాయంతోనే రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ దాడులతో రష్యా చమురు రవాణాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు.
Latest News