|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 04:56 PM
ఏపీ గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార పీఏగా పనిచేస్తున్న సతీష్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) తీవ్రంగా స్పందించింది. అతడిని తక్షణమే ఆ బాధ్యతల నుంచి తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సతీష్ విధుల్లో కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఓ మహిళ, మంత్రి పీఏ సతీష్ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం సీఎంవో దృష్టికి వెళ్లడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. సతీష్పై కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Latest News