|
|
by Suryaa Desk | Sun, Jun 22, 2025, 09:57 PM
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యలో వచ్చి ఇరాన్పై అణుస్థావరాలపై అమెరికా దాడిలు చేసింది. దీంతో యుద్ధం తీవ్రత మరింత పెరిగింది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో బంకర్లలో ఆశ్రయం పొందుతున్న కమాండర్లు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత రహస్యమైన ప్రదేశానికి తరలించినట్లు సమాచారం.
ఖమేనీ ఉన్న ప్రదేశంలో ఎటువంటి సిగ్నల్స్ రాకుండా అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను నిలిపివేశారు. అయితే ఖమేనీకి ఏదైనా జరిగితే ఆయన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది. ఆయనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుత పరిస్థితులు, టెహ్రాన్ ప్రతిదాడుల గురించి ఆయనతో చర్చిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ సుప్రీం లీడర్ తన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ఓ ప్రచురించింది. అయితే సుప్రీం లీడర్ సూచించిన పేర్లను ఇరాన్లోని మతాధికారులు పరిశీలిస్తారు. ఆ తరువాత కొన్ని పేర్లను ఎంపిక చేస్తారు. యుద్ధంలో ఖమేనీకి ఏదైనా ప్రమాదం జరిగితే, ఆయన సూచించిన వారిలో ఒకరిని ఎన్నుకోవడానికి చర్యలు తీసుకుంటారు. అయితే తాను సూచించిన పేర్ల నుంచి ఒకరిని త్వరగా ఎంపిక చేయాలని ఖమేనీ ఈ ప్రక్రియ నిర్వహించే నిపుణుల బృందాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇరాన్ సుప్రీం లీడర్కు చాలా అధికారాలు ఉంటాయి. ఆయన ఇరాన్ సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్గా, న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా వ్యవహరిస్తారు. అయితే, ఈ పదవికి ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని ఎంపికి చేస్తారని ఆప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఖమేనీ ఎంపిక చేసిన పేర్లలో మోజ్తాజా పేరు లేదు. కాగా, ఖమేనీ.. సుప్రీం లీడర్తో పాటు ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన మిలిటరీ కమాండర్లను ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయేల్ జూన్ 13న దాడులు ప్రారంభించింది. ఖమేనీ ఇంటితో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే ప్రాంతంలోనూ వైమానికి దాడులు చేసింది. అయితే మొదటి ఖమేనీని అంతమొందించాలనుకున్న ఇజ్రాయెల్.. అయితే అణుశుద్ది కార్యక్రమాన్ని పూర్తిగా నిపివేసేందుకు ఇరాన్కు మరో ఛాన్స్ ఇవ్వాలని టెల్ అవీవ్ భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇరాన్ అణు, సైనిక కేంద్రాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ కీలక అణు శాస్త్రవేత్తలు, సైనికాధికారులు, అణు ప్రాజెక్టు నిపుణులు హతమయ్యారు. ఇరాన్లోని ఐక్యరాజ్యసమితి రాయబారి ప్రకారం, ఈ దాడుల్లో 78 మంది మరణించారని, 320 మందికి పైగా గాయపడినట్లు చెప్పారు.
Latest News