|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:07 PM
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో కెప్టెన్ శుభ్మన్ గిల్ 56 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నారు. టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాక తొలి మ్యాచ్లోనే శుభ్మన్ గిల్ అదరగొడుతున్నారు. జోష్ టంగ్ వేసిన 43 ఓవర్లో రెండో బంతిని బౌండరీకి కెప్టెన్గా తొలి అర్ధ శతకం అందుకున్నారు. దీంతో 43 ఓవర్లకు స్కోరు 183/2గా ఉంది. క్రీజులో గిల్ (52), యశస్వి జైస్వాల్ (79) పరుగులతో ఉన్నారు.
Latest News