ఖమేనీ ప్రభుత్వానికి బలోచ్, కుర్దు మైనారిటీల నుంచి ముప్పు
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 05:32 PM

ఇరాన్ ప్రస్తుతం పలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇజ్రాయెల్ నుంచి క్షిపణుల దాడులు, మరోవైపు అమెరికా నుంచి పొంచి ఉన్న ముప్పు ఆందోళన కలిగిస్తుండగా, దేశంలోని వేర్పాటువాద శక్తులు కూడా బలపడుతున్నాయి. ఇరాన్ బలహీనపడుతోందన్న సంకేతాల నేపథ్యంలో, ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇరాన్, పాకిస్థాన్‌లలోని మిలిటెంట్ గ్రూపులు ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.ఇరాన్‌లోని పరిణామాలు కేవలం ఆ దేశానికే పరిమితం కాకుండా, పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ బలహీనపడితే, ఆ ప్రభావం తమ దేశంపై తీవ్రంగా ఉంటుందని పాకిస్థాన్ ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా, ఇరాన్‌లో సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వం కూలిపోతే బలూచిస్థాన్ ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ అంశాన్ని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది.పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌తో పాటు, ఇరాన్ సరిహద్దుల్లోని సిస్థాన్, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోనూ బలూచ్ ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వం వీరిపై అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపణలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు ప్రాంతాల్లోని బలూచ్ ప్రజలు ఏకమై, ప్రత్యేక బలోచిస్థాన్ కోసం తమ పోరాటాన్ని తీవ్రతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ  ఇప్పటికే పాకిస్థాన్ సైన్యంపై దాడులను పెంచింది. గతంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటనలో కూడా ఈ సంస్థ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.ఇరాన్, పాకిస్థాన్ దేశాలకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న 'జైష్ అల్ అదిల్' అనే మిలిటెంట్ సంస్థ మరో తలనొప్పిగా మారింది. ఇది ఇరాన్‌కు చెందిన వేర్పాటువాద సంస్థ అయినప్పటికీ, ఇందులో అధికశాతం బలూచ్ సభ్యులు ఉండటంతో దీని కార్యకలాపాలు పాకిస్థాన్‌ను కూడా కలవరపెడుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తమకు అనుకూలమైన అవకాశమని జైష్ అల్ అదిల్ ఇప్పటికే ప్రకటించింది. "ఇరాన్ ప్రజలందరి పట్ల జైష్ అల్ అదిల్ సోదరభావాన్ని ప్రకటిస్తోంది. ముఖ్యంగా బలూచిస్థాన్ ప్రజలు సాయుధ దళాలపై పోరాటానికి సిద్ధం కావాలి" అని ఆ సంస్థ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. బలూచ్ ప్రజలు పాకిస్థాన్ జనాభాలో సుమారు 3.6 శాతం, ఇరాన్, అఫ్ఘానిస్థాన్ జనాభాలో దాదాపు 2 శాతం వరకు ఉన్నారు. ఈ వర్గాలు ఏకమైతే పరిస్థితి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.బాహ్య బెదిరింపులతో పాటు, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వానికి దేశంలోని మైనారిటీ వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. షియా ఆధిపత్యం గల ఇరాన్‌లో బలూచ్, కుర్దు వంటి మైనారిటీ వర్గాలు ఎక్కువగా సున్నీలు ఖమేనీ ప్రభుత్వ పాలనలో అణచివేతకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ జనాభాలో దాదాపు 15 శాతంగా ఉన్న కుర్దులు సుమారు 10 నుంచి 12 మిలియన్ల మంది ఖమేనీ ప్రభుత్వం పతనమైతేనే తమ పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తూ, ఆ దిశగా ప్రజలను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM