|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 07:03 PM
క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాలను కల్పించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు మద్దతు నివ్వడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి సహకారం అందించాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూత నందించాలని, కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన గుంటూరు సమీపం నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ డిస్టిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్లో హాకీ, షూటింగ్లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయాలని కోరానన్నారు. ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 341.57 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపాలని కోరినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
Latest News