|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 06:36 PM
తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రీజనల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను కోరానని మంత్రి లోకేష్ తెలిపారు. ఖేలో ఇండియాలో భాగంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్ను తిరుపతిలో నెలకొల్పాలని కోరాన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో జిల్లాస్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాస్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశానన్నారు. తాను చేసిన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి మాండవీయ స్పందించారని, ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని చెప్పారని, ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని హామీ ఇచ్చారని లోకేష్ తెలిపారు. అనంతరం యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు అందజేశానని మంత్రి లోకేష్ చెప్పారు.
Latest News