|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 02:06 PM
మోపిదేవి మండలం రావివారిపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలో చికిత్స నిమిత్తం వచ్చిన రోగులకు వైద్యులు సరిగా సేవలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారితో మాట్లాడి ఆసుపత్రిలో అవసరమైన అన్ని మందులు ఉన్నాయా లేవా అని అడిగారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు.
Latest News