|
|
by Suryaa Desk | Wed, Jun 18, 2025, 09:50 AM
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్డీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ వంటి అంశాలపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ దృష్టి సారించాల్సిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. సంక్షేమానికి వనరులు లభ్యత పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని, ఆర్థిక సుస్థిరత కోసం సేవల రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై విభిన్న మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని అన్నారు. తలసరి ఆదాయంలో ఏడాదిలోనే మెరుగైన ఫలితాలు మంచి పరిణామం అని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖలకు మార్గ నిర్దేశం చేయడంలో ప్రణాళిక విభాగం కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు.
Latest News